మన్యం మనుగడ, పినపాక:
గ్రామీణ వైద్యులు వారి పరిమితికి మించే వైద్యం చేయాలని, హద్దు మీరి ఎంబీబీఎస్ వైద్యుల మాదిరి వైద్యం అందించాలని చూస్తే కటిన చర్యలు తప్పవని ఏడూళ్ళ బయ్యారం సి.ఐ రాజగోపాల్ అన్నారు.. సోమవారం ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్లో గ్రామీణ వైద్యులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండలంలోని గ్రామాలలో ఉన్న గ్రామీణ వైద్యులు, పరిమితికి మించి వైద్యం చేయకూడదని, మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రులకు పంపించాలని ఆయన సూచించారు. అమాయకమైన ప్రజల నుండి ఇష్టానుసారంగా,వైద్యం కొరకు డబ్బులు వసూలు చేయొద్దని,చేస్తే ఎవరిని సహించేది లేదని ఆయన అన్నారు. గ్రామీణ వైద్యులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు వైద్యం కోసం, వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడూళ్ళ బయ్యారం ఎస్సై టివిఆర్ సూరి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: