మన్యం మనుగడ కరకగూడెం:మండల పరిధిలోని బట్టుపల్లి విరపూరం క్రాస్ రోడ్డు వద్ద ఉన్న కొమరం బిమ్ విగ్రహాన్నికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరై తొలుత ఆదివాసీ జెండాను ఎగురవేశారు.అనంతరం కొమరం భీమ్ విగ్రహన్నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆదివాసీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికీపీడియా కమీటీ1992 సంవత్సరం నుండి పది సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆదివాసీ సమస్యలను అధ్యయనం చేసి విశ్లేషించి 1994 నుండి 2014 సం,,వరకు ఆ మద్యకాలన్ని ఆదివాసీల అభివృద్ధి కాలంగా పరిగణించి ఆగష్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించారు అని అన్నారు.ఆదివాసుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొమరం భీమ్ ఆశయాలను సాధించాలని అన్నారు.ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయాలు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ రేగా కాళికా,బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు, తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు సూతరి.నాగేశ్వరరావు,అధార్ స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు తొలెం.రమేష్, సిద్దబోయిన.శ్రీకాంత్,ఉమ్మడి ఖమ్మం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ కొమరం.వెంకటనారాయణ, గంగరాజు,సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు పాయం.నర్సింహరావు,వట్టం.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: