CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జూలూరుపాడు ఆర్.సి.యం చర్చి కాంపౌండ్ లో జింక ప్రత్యక్షం.

Share it:


జూలూరుపాడు ఆగస్టు 17, (మన్యం మనుగడ ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోనీ ఆర్.సి.యం చర్చ్ కాంపౌండ్ లో బుధవారం సాయంత్రం అడవి జింక ప్రత్యక్షమైంది. వివరాలలోకి వెళ్తే, జూలూరుపాడు కోయ కాలనీకి చెందిన పంపు రాములు అనే వ్యక్తి మేకలను అడవిలో మేపుకొని తిరిగి ఇంటికి వస్తుండగా మేకలతో కలసి అడవి జింక ఒకటి జనావాసాల్లోకి వచ్చింది. కంగారుగా చర్చి కాంపౌండ్ లో పరుగులు తీస్తున్న జింకను చూసిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎఫ్ఆర్ఓ ప్రసాదరావు తన సిబ్బందితో వచ్చి గ్రామస్తుల సహకారంతో జింకను సురక్షితంగా పట్టుకొని, స్థానిక ఫారెస్ట్ ఆఫీసుకు తరలించారు. స్థానిక వెటర్నరీ డాక్టర్ తో పరీక్షించి అనంతరం పై అధికారుల సూచన మేరకు అటవీ జింకను చేరుస్తామన్నారు. ఇది ఆడ జింక అని, సుమారు రెండు సంవత్సరాల వయసు కలిగి ఉంటుందని ఎఫ్ఆర్ఓ ప్రసాదరావు తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న గ్రామస్తులు, చిన్నారులు జింకను చూసేందుకు పరుగులు పెట్టారు.

Share it:

TS

Post A Comment: