గుండాల ఆగస్టు 21(మన్యం మనుగడ) భారత 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని పంచాయతీ తీలలో మొక్కలు నాటిన అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాల కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని జెడ్పిటిసి రామక్క, ఎంపీడీవో సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పుట్టినరోజుకు పెళ్లిరోజుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ హజరత్ వలి, ఏపీవో రవితేజ, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు
Post A Comment: