మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: జర్నలిస్టులు వృత్తి ధర్మాన్ని పాటిస్తూ సమాజంలో నెలకొన్న ప్రజా సమస్యలపై కలంతో పోరాటం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టిడబ్ల్యూజెఎఫ్ ) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అనిల్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక భాస్కరా ఫంక్షన్ హాల్ నందు జరిగిన అశ్వరావుపేట నియోజకవర్గ టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అనిల్ రెడ్డి ప్రధమ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తుందని, జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ప్రభుత్వం మంజూరు చేయాలని, ప్రతిఒక్కరికి హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్టులకు అండగా ఉంటుందన్నారు. అనంతరం నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టిడబ్ల్యూజేఎఫ్ అశ్వరావుపేట నియోజకవర్గ అధ్యక్షునిగా మట్లకుంట చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా కుంజా వెంకటేష్, ఉపాధ్యక్షులుగా ఎండి పాషా, శివకుమార్, గౌరవ అధ్యక్షునిగా సయ్యద్ రబ్బానీ, సహాయ కార్యదర్శులుగా పువ్వుల శ్రీనివాస్, కోశాధికారిగా ఆకుల శివ, కమిటీ సభ్యులుగా కూరం సురేష్, చెన్నారావు, కుక్కముడి దినేష్, సవలం వెంకటేశ్వర్లు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రమిశెట్టి సైదయ్య, మడిపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు సూరిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు కోటా చారి, జిల్లా కమిటీ సభ్యులు బొగ్గుల శివనాగిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: