మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను మణుగూరు మండల వీఆర్ఏలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విఆర్ ఏ లు వారు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది.అనంతరం విప్ రేగా కాంతరవుకు వినతిపత్రం అందజేశారు.సమస్యలపై స్పందిస్తూ విప్ రేగా త్వరలోనే సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది.జడ్పిటిసి పొశం. నర్సింహారావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, విఆర్ ఏ లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: