CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా స్వతంత్ర భారత 75వ వజ్రోత్సవ వేడుకలు..

Share it:

 



జూలూరుపాడు ఆగస్టు 10, (మన్యం మనుగడ ప్రతినిధి) స్వతంత్ర భారత 75వ వజ్రోత్సవ వేడుకలలో భాగంగా జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామపంచాయతీలో "వన మహోత్సవ" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా పాల్గొని, 75 సంవత్సరాలకు గుర్తుగా, 75 సంఖ్యలో వివిధ రకాల 750 మొక్కలను నాటి "ఫ్రీడమ్ పార్కును" ఏర్పాటు చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ వేడుకలను మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజా భాగస్వామ్యంతో నిర్వహిస్తూ, ప్రజలకు భారతదేశ స్వాతంత్ర చరిత్ర గొప్పతనం గురించి వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్రం మోహన్ రావు, జడ్పిటిసి భూక్య కళావతి, తహశీల్దార్ లూథర్ విల్సన్, ఎంపీడీవో తాళ్లూరి రవి, ఎంపీఓ రామారావు, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ పోటు గణేష్, అటవీశాఖ రేంజ్ అధికారి ప్రసాదరావు, ఈజీఎస్ ఏపీవో సుహాసిని, గిర్ధవర్ తిరుపతి, కరివారి గూడెం సర్పంచ్ శాంతిరాం, చింతలతండా సర్పంచ్ రాములు, కొమ్ముగూడెం సర్పంచ్ శాంతిలాల్, పోలీస్ శాఖ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: