CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలలో భాగంగా రేపు(11-08-2022) జిల్లా వ్యాప్తంగా జరగబోయే "ఫ్రీడం రన్‌"ను విజయవంతం చేయాలి :ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్.

Share it:



స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలను పురస్కరించుకుని రేపు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఫ్రీడం రన్‌లో పౌరులు అధిక సంఖ్యలో పాల్గొని జాతీయ భావాన్ని చాటి చెప్పాలని ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం ప్రతి రోజూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడంలో భాగంగా జిల్లాలోని పట్టణ,మండల కేంద్రాలలో వేల మందితో ఈ 2K "ఫ్రీడం రన్‌"ను నిర్వహించాలని ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.ఇందులో విద్యార్థులు,క్రీడాకారులు,ప్రజా ప్రతినిధులు,కళాకారులు,ప్రజలు,ప్రజా సంఘాలు,మీడియా ప్రతినిధులు,స్వచ్ఛంద సేవా సంస్థలు,ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర ఆర్గనైజేషన్స్ వారంతా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Share it:

TS

Post A Comment: