మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని గోదావరి వరద ముంపు గురైనటువంటి పర్ణశాల పంచాయతీ పరిధిలోని ఎల్లంరావుపేట ముసలిమడుగు పర్ణశాల క్రాస్ రోడ్ గ్రామాల బాధిత కుటుంబాలకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ఎత్తు కట్టడం వల్ల భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు ముప్పు పొంచి ఉందని ఆనాడే ప్రభుత్వానికి సిపిఎం పార్టీ వినిపించకుందని దానికోసం పోరాటాలు కూడా చేసిందని కానీ ప్రభుత్వం ఎటువంటి ముందు జాగ్రత్త చర్య తీసుకుని ఉంటే ఇటువంటి విపత్తు వచ్చేది కాదని తెలియజేశారు ముఖ్యమంత్రి ప్రకటించిన వెయ్యి కోట్ల నిధులు త్వరగా మంజూరు చేసి గోదావరి పరివాహక ప్రాంత ముంపు ప్రజలను శాశ్వతంగా ఎత్తైన ప్రదేశం ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య బాలరాజు జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ యలమంచి వంశీ చిలకమ్మా చంద్రయ్య స్థానిక ఉప సర్పంచ్ ఖాదర్ బాబు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: