మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లోని మల్లెల మడుగు గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేసుపాక చంద్రశేఖర్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో మంజూరైన దళిత బంధు యూనిట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం లో దళితుల కుటుంబాలలో ఆనందాన్ని నింపిన నాయకుడు నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు, గత ప్రభుత్వాల పాలనలో కష్టాలు పడ్డ దళిత కుటుంబాలలో ఇంత కాలానికి చిరునవ్వులు చూస్తున్నాయని అన్నారు, దీనికి కారణమైన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యావత్ దళిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు, ఈ పథకం ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత కుటుంబాలకు దేవుడిగా మారారని తెలిపారు, అదేవిధంగా దేశంలో ఎక్కడా లేనటువంటి పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: