CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కొర్స ఎర్రయ్య మరణం పార్టీకి తీరని లోటు.. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య..

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

దుమ్ముగూడెం మండలం ఆర్లగూడెం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కొర్స ఎర్రయ్య మరణం సిపిఎం పార్టీకి వారి కుటుంబానికి తీరనిలోటని మండల కార్యదర్శి కారం పుల్లయ్య అన్నారు వారి మృతి దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1988 నుండి సిపిఎం పార్టీలో సభ్యత్వం తీసుకొని పేద ప్రజల పక్షాన పనిచేసిన మహానీయుడనే ఏనాడు కూడా పదవుల కోసం ఆశపడకుండా నిత్యం ప్రజాభివృద్ధి కోసమే పాటుపడిన మహావీరుని లేని లేటు ఆ ప్రాంత సిపిఎం పార్టీకి నాయకులు కార్యకర్తలకు తీరనిలోటు అని తెలియజేశారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల నాయకులు ఎర్రయ్య మృతిదేహాన్ని ఎర్రజెండా కప్పి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోటేశ్వరావు చంద్రయ్య రాజమ్మ పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీని బాబు బైరెడ్డి సతీష్ మాజీ సర్పంచ్ రమేష్ నారాయణరావుపేట ఎంపీటీసీ పెనుబల్లి సీతమ్మ నాగేశ్వరరావు గంగరాజు రాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: