మన్యం మనుగడ, పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామానికి చెందిన పొనుగోటి ధన కోటేశ్వరరావు అనే వ్యక్తి ఇంటిలో అక్రమ కలప నిలువ ఉంచారని పూర్తి సమాచారంతో ఏడూళ్ళ బయ్యారం అటవీ క్షేత్ర అధికారి తేజస్వి తన సిబ్బందితో కలిసి, అతని ఇంటిని తనిఖీ చేయగా నిల్వ ఉంచిన రెండు టేకు దిమ్మలు లభించాయని, అటవీ క్షేత్ర అధికారి తేజస్వి తెలియజేశారు. ఇందు నిమిత్తం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి జరిమానా విధించామని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ అరుణ, ఫారెస్ట్ బీట్ అధికారి రంగారావు, సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: