మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట పట్టణంలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల పంచాయితీ సెక్రటరీ లు మరియు మండల ప్రజా పరిషత్ కార్యాలయం సిబ్బందికి డాక్టర్స్ సంతోష్, రమేష్ హైదరబాద్ నిజాం ఇనిస్ట్యూట్ నుండి వచ్చిన వారిచే నిర్వహించినా ఫిజియథెరపీ అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన ఆరోగ్యానికి ప్రతి నొప్పికి ఈ ఫిజియథెరపీ చాలా ఉపయోగ పడుతుందని, ఇది మనం స్వయంగా నేర్చుకోవడం వలన డాక్టర్స్ దగ్గరకి వెళ్ళి మనం గంటకి ఇంత అని ఫీజు పే చేయకుండా, ప్రతీ నొప్పులకు ఈ ఫిజియథెరపీ నేర్చుకోవడం వలన మంచి ఉపయోగం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్ డెంట్, ప్రసాద్, యుడిసీ కుమారి, ఎల్డిసీ శ్రీనివాసరావు, టైపిస్ట్ ప్రసాద్ మరియు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: