CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మావోయిస్టు ల చెరలో మాజీ సభ్యుడు జీవన్.. ప్రజా కోర్టు నిర్వహించి విడుదల చేసిన మావోయిస్టులు.

Share it:



మన్యం టీవీ -


చర్ల ::

నాలుగు రోజులు క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కిష్టారం పాడు గ్రామంలో నివాసం ఉంటున్న  మాజీ దళ సభ్యుడు జీవన్ ను మావోయిస్టు కిడ్నాప్ చేసారు. పోలీస్ ఇన్ ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారని ఇతనిని దండకారణ్యంలోనీ ఓ కీకారణ్యంలో ప్రజాకోర్టు ఏర్పాటు చేసి  క్షమాభిక్ష పెట్టి ఒక అవకాశం ఇస్తూ విడిచి పెడుతున్నట్లు లేక విడుదల చేశారు అజాద్ నేతృత్వంలో ప్రజాకోర్టులో నిర్వహించినట్లు తెలియవస్తోంది. జీవన్ గతంలో మావోయిస్ట్ పార్టీలో పని చేస్తూ 2021 మార్చిలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పార్టీలో ఉన్నప్పుడు చర్ల మండలం కిష్టారం పాడు కు చెందిన గంగి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం ఈ దంపతులు ఇద్దరూ మావోయిస్టు పార్టిలో పనిచేసారు. అనంతరం వ్యక్తిగత కారణాలతో పోలీసుల ఎదుట లొంగిపోయారు.ఆ తర్వాత పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడని  ఆరోపిస్తూ ఇతనిని మావోయిస్టులు అపహరించారు ఎట్టకేలకు జగన్ ని మావోయిస్టులు హెచ్చరించి విడిచిపెట్టినట్లు లేక లో తెలిపారు దళాల సమాచారం పోలీసులకు తెలియజేస్తే ఈసారి వదిలే ప్రసక్తి లేదని మావోయిస్టులు హెచ్చరించారు. జీవన్ సొంత గ్రామం తూర్పుగోదావరి జిల్లా, ఎటపాక మండలం, జగ్గారం గ్రామం అలానే ప్రజా కోర్ట్ ఆజాద్ నేతృత్వంలో కీలక నేతలు మధు, అరుణ,రజిత తదితర నేతల సమక్షంలో జీవన్ ను విచారణ చేస్తున్నట్లు తెలిసింది.ఇందుకు సంబంధించిన  వీడియోలను మీడియాకు విడుదల చేశారు.తాజా ఈ ఘటన తో ఏజెన్సీ ప్రాంతంలో కలకలం రేపుతోంది.

Share it:

TELANGANA

Post A Comment: