జూలూరుపాడు ఆగస్టు 23, (మన్యం మనుగడ ప్రతినిధి) :
ఎమ్మార్పీఎస్ జాతీయ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ పిలుపుమేరకు మంగళవారం జూలూరుపాడు మండల వ్యాప్తంగా విద్య సంస్థల బంద్ ప్రశాంతంగా ముగిసింది. రాజస్థాన్ రాష్ట్రం, జల్లూరు జిల్లా, సురానా గ్రామంలోని సరస్వతి విద్యా మందిర్ లో 3వ, తరగతి చదువుతున్న ఇంద్ర కుమార్ మెగ్వాల్ అనే దళిత విద్యార్థి విద్యా మందిర్ లో ఉన్న మంచినీటి కుండలో నీళ్లు త్రాగాడనే కారణంతో అగ్రకులానికి చెందిన చైన్ సింగ్ అనే ఉపాధ్యాయుడు విచక్షణ రహితంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి గాయాల పాలైన విద్యార్థి వైద్యశాలలో 24 రోజులు మృత్యువుతో పోరాడి మృతి చెందాడు. విద్యార్థి ఇంద్ర కుమార్ మెగ్వాల్ మరణ వార్త తెలిసినా, తెలియనట్లు ప్రధానమంత్రి మోడీ మౌనాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ పిలుపులో భాగంగా మండల వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చెంగల గురునాథం తెలిపారు. సహకరించిన విద్యాసంస్థల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దామెర్ల శ్రీకాంత్, గార్లపాటి శివకృష్ణ, దామెర్ల సుధాకర్, కంచ పోగు రాజశేఖర్, చంగల కృష్ణారావు, ఎమ్మెస్ ఎఫ్ నాయకులు చెంగల జాంబవ, మిరియాల శ్రీకాంత్, మిరియాల గోపి, సాయి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: