CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా చేడే మాధవ్ 20 వ వర్ధంతి సభ

Share it:



  •  కామ్రేడ్ చేడే మాధవ్ ఆశయాల సాధనకు కార్యకర్తలు పని చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య. 
  • పార్టీ కార్యాలయంలో ఘనంగా చేడే మాధవ్ 20 వ వర్ధంతి సభ 

ములకలపల్లి: మన్యం మనుగడ ప్రతినిధి :

అమరజీవి కామ్రేడ్ చెడే మాధవ్ ఆశయాల సాధనకు కార్యకర్తలు పనిచేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య కోరారు.మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కార్యాలయంలో చేడే మాధవ్ 20వ వర్ధంతి సభసందర్బంగా మాట్లాడుతూ చేడే మాధవ్ మండలం లో ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేసి భూమి పంచినటువంటి వ్యక్తని,గతంలో  ప్రజా పోరాటాలతో దొరల ఆగడాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ పార్టీ బలోపేతనికి కృషి చేశారని,కట్వాయి కార్మికుల పోరాటాలు పెద్ద ఎత్తున నడిపి కట్వాయి కార్మికులకు అండగా నిలబడి సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం నిర్వహించారని గుర్తు చేశారు. కార్యకర్తలందరూ చెప్పు చెడే మాధవ్ ఆశయాలు అనుగుణంగా ప్రజా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. బిజెపి పార్టీ చరిత్రను వక్రీకరిస్తూ తప్పు దోవ పట్టిస్తున్నారని అన్నారు. గాంధీని చంపిన గాడ్సే ఆర్ఎస్ఎస్ కార్యకర్తే నని బిజెపి దేశ స్వతంత్ర ఉద్యమంలో తన పాత్ర ఏమిటో ప్రజలకు తెలుసాని, చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బిజెపి పార్టీ మత విద్వేషాలు రెచ్చగొడుతూ,దళిత,గిరిజనులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు అన్నవరపు సత్యనారాయణ, పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, చేడే పద్మావతి,ఊకంటి రవికుమార్,నిమ్మల మధు, గోపగాని లక్ష్మీ నరసయ్య, , మాలోతు రావూజా, వర్సా శ్రీరాములు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: