CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతీయ రహదారికి శ్రమదానం చేసి నిరసన తెలిపిన బిఎస్పి నాయకులు..

Share it:



జూలూరుపాడు ఆగస్ట్ 23, (మన్యం మనుగడ ప్రతినిధి):
 మండల పరిధిలోని వినోబా నగర్ గ్రామం వద్ద ఖమ్మం నుండి భద్రాచలం జాతీయ  రహదారి ఇరువైపులా కిలోమీటర్ల పొడవున పూర్తిగా దెబ్బతిని గుంతల మయంగా మారిందని, దీంతో ప్రయాణికులు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ గుంతల కారణంగా ఈ ప్రాంతంలో తరసు యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అయినప్పటికీ సంబంధిత రోడ్డు రవాణా శాఖ అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి నిరసనగా మంగళవారం బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇకనైనా అధికారులు మేల్కొని రోడ్డుకు మరమ్మత్తులు చేపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ  మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు, ఉపాధ్యక్షులు కంచిపోగు నరసింహారావు, కార్యదర్శి గార్లపాటి సైదులు, మండల మహిళా అధ్యక్షురాలు దేవరకొండ నిర్మల, ఉపాధ్యక్షురాలు పొంగల లలిత, పివిఎఫ్ మండల కన్వీనర్ మందకృష్ణ, కంచ పోగు తిరుపతిరావు, మంద రాజశేఖర్, పోతురాజు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: