దమ్మపేట(ములకలపల్లి )మన్యం మనుగడ ప్రతినిధి:
ఏఐఎస్ఎఫ్,పిడి యస్ యు, ఆధ్వర్యంలో దమ్మపేట ఉప తాసిల్దార్ కు సమస్యలతో కూడిన వినతి పత్రంఅందించారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి బత్తుల సాయి,ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుంకుపాక ధర్మ,పిడియస్ యు.కుంజ రాజ్ కుమార్ మాట్లాడుతూ దమ్మపేట మండలానికి కి జూనియర్ కాలేజీ మంజూరై ఆరు నెలలు గడుస్తున్నా ఇంకా క్లాసులు ప్రారంభించ లేదనీ, తక్షణం జూనియర్ కాలేజీ విద్యార్థులకు దమ్మపేట లోనే క్లాసులు ప్రారంభించాలని,కాలేజీ విద్యార్థులకు స్కాలర్షిప్ ను 25000 పెంచాలని, మెస్ చార్జీ 5000 రూపాయలకు పెంచాలని విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్ లను వెంటనే మంజూరి చెయ్యలని,పాఠశాల విద్యార్థులకు మెస్ చార్జీ రోజుకు 15 రూపాయలు ఇవ్వాలని,పాఠ్య పుస్తకాలు వెంటనే ఇవ్వాలని,ఖాళీగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని, ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలను, స్కూళ్లను నడపాలని,అన్ని వర్గాల విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని,నిరుద్యోగ యువతీ యువకులకు నెలకు 5000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని,ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని. నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పండూరి వీరబాబు, ఏఐటీయూసీ కార్యదర్శి బెజవాడ రాము,పిడి యస్ యు కాక శివప్రసాద్, లక్ష్మీనారాయణ,వెంకట్ మోహన్,శివ, తదితర విద్యార్థి యువజన కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: