CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యార్థులతో తహసిల్దార్

Share it:

 




మన్యం మనుగడ, పినపాక :


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని కస్తూర్బా బాలిక విద్యాలయంలో పినపాక మండల తహసిల్దార్ శుక్రవారం నాడు విద్యార్థులతో కలిసి అల్పాహారము సేవించారు. గురువారం నాడు విద్యార్థులు అంతా కలిసి మెనూ సరిగా పాటించడం లేదని ధర్నా చేసిన విషయము విధితమే. ఈ విషయంపై స్పందించిన అధికారులు వెంటనే వారికి అన్ని రకాలుగా పోషకాహారంతో కూడిన ఆహారాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం కస్తూర్బా బాలిక విద్యాలయానికి తహసిల్దార్ విక్రమ్ కుమార్ వెళ్లి, విద్యార్థులతో కలిసి అల్పాహారం సేవించారు.ఇకనుండి మెనూ విషయంలో ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదని, నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో ముందుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ అరుణ, అధ్యాపక సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: