CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాజుపేట ను వెంటనే మండల కేంద్రం చేయాలి (టీ ఏ జి ఎస్ )

Share it:

 



మన్యం మనుగడ, మంగపేట.


రాజుపేట కేంద్రం చేయాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ( టీ, ఏ,జి, ఎస్ ) మంగపేట మండలం నాయకులు కొమరం సందీప్ఈ సందర్బంగా తెలియజేసారు.అఖినేపెళ్లి మల్లారం నుంచి చుంచుపల్లి వరకు రాజుపేట కేంద్రంగా చేసుకొని మండలం ఏర్పాటు చేయాలని అన్నారు. పేద మధ్యతరగతి  కుటుంబాలు మంగపేట వెళ్లాలంటే చార్జీలు అధికంగా పెరగటం వలన ప్రజలు పోలేని పరిస్థితుల్లో ఉన్నారు, అదేవిధంగా పోయినా గాని ఒక్కరోజుతో పని కావటం లేదు అంటున్నారు దోమడ, తక్కెళ్ళగూడెం, తిమ్మాపురం చీపురు దుబ్బ,ప్రాంతాలను కలుపుకొని దాదాపు 15 గ్రామపంచాయల దాకా ఉంటాయి. ఈ గ్రామ పంచాయతీలన్నీ కలుపుకొని రాజుపేట మండల కేంద్రం చేయాలని  గతం నుంచి కూడా అధికారులకు ఎన్నోసార్లు తెలియజేశామన్నారు కానీ అధికారులు ఇంకా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాజుపేట ను మండల కేంద్రం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనియెడల రాజుపేట చుట్టుపక్కల గ్రామస్తులు అంత కలిసి సమరశీల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సుధాకర్ ,రవి, నాగభూషణం,నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: