మన్యం మనుగడప్రతినిధి , అన్నపురెడ్డిపల్లి(ములకలపల్లి ): :
ఐటీసీ బంగారు భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా యూత్ డేవలోపమెంట్ ఆఫ్ పీపుల్స్ ఆర్గనైజాషన్ అనే స్వచ్ఛంద సంస్థ వారు వృక్ష సంయుత వ్యవసాయంలో గ్రామ కామన్ ల్యాండ్ లో జీవ వైవిధ్యం పెంపొందించాలనే లక్ష్యంగా ఐటీసీ బంగారు భవిష్యత్తు ప్రోగ్రాం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ సందర్బంగా యూత్ డేవలోపమెంట్ ఆఫ్ పీపుల్స్ ఆర్గనైజాషన్ సంస్థ కోర్దినేటర్ నాగేంద్ర మాట్లాడుతూ, రైతులు తమ పంట పొలాల్లో వివిధ మొక్కలు పెంచడం ద్వారా అంతరించిపోతున్న మొక్కలను కాపాడటం తో పాటు జీవ వైవిధ్యం పెరుగుతుందని,తద్వారా మంచి వాతావరణం మరియు మంచి ఆరోగ్యం తో పాటు దీర్ఘకాలిక ఆదాయం చేకూరుతుందని తెలిపారు. అనంతరం ఎంపిపి సున్నం లలిత మాట్లాడుతూ చెట్లు పెంచడం ద్వారా వాతావరణ కాలుష్యం తగ్గిచడంతో, పాటు స్వచ్ఛమైన ఆక్సిజన్ ని పొందవచ్చు అన్నారు.తొట్టిపంపు పంచాయతీ సెక్రటరీ ప్రశాంత్ కుమార్ గారు మాట్లాడుతూ ఐటీసీ వారు ప్రారంభించిన ఈ కార్యక్రమం వలన రైతులకు, మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సున్నం చిరంజీవి,సంస్థ సిబ్బంది రమేష్ , నాగేంద్ర, నాగరాజు,కృష్ణ రావు, స్వామి, రైతులు తదితరులు పాల్గున్నారు.
Post A Comment: