CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేద ప్రజల అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది : మంత్రి సత్యవతి రాథోడ్.

Share it:

 



మన్యం మనుగడ ఏటూరు నాగారం: 

పేద ప్రజల సంక్షేమం అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.సోమవారం ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆసరా పింఛన్ల కార్డుల జారీ కార్యక్రమంలో 9  మండలాలకు చెందిన 8 వేల 424మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛను కార్డులను పంపిణీ  చేశారు.ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్  మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 33 వేల 179 పెన్షనర్లు ఉండగా,కొత్తగా 8424 మందికి పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని,ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.స్వయం పాలనలో అర్హులైన అందరికీ ఆసరా పింఛన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు.అభివృద్ధితో పాటు సంక్షేమం రెండు కండ్లల కేసిఆర్ చూస్తున్నారని,గతంలో ఇందిరాగాంధీ గరీబ్ హటావో,ఎన్టీఆర్ రెండు రూపాయల కిలో బియ్యం,జనాలకు జనతాబట్టలు సంక్షేమ రుచిచూపించారని అలా మంచి మనసుతో సిఎం పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని అన్నారు. జిల్లాలో ఇప్పుడు వృద్ధాప్య పింఛన్లు 5583,వితంతువులు 2056, దివ్యాంగులు 569,చేనేత కార్మికులకు 35,గీత కార్మికులకు31,బీడీ కార్మికులకు 4,ఒంటరి మహిళలకు 146 ప్రభుత్వం అందిస్తుందని జిల్లాకు 1 కోటి 75లక్షల 51వేల 784 రూపాయలు మంజూరు చేసిందని ఆమె తెలిపారు.75 ఏళ్ల స్వాతంత్ర్యం పురస్కరించుకొని వజ్రోత్సవాలను 15 రోజులపాటు జిల్లాలో ఘనంగా నిర్వహించుకున్నామని అన్నారు.రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఉన్న ములుగును సిఎం కేసిఆర్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

ములుగు కలెక్టరేట్ భవన నిర్మాణానికి రూ.65కోట్లు మంజూరుచేసి టెండర్లు, అగ్రిమెంటు పూర్తయిందని త్వరలో ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేయుటకు జిల్లాకు రానున్నారని తెలిపారు. ఏటూరు నాగారంలో డయాలసిస్ సెంటర్ త్వరలో వైద్యశాఖ మంత్రితో ప్రారంభిస్తామన్నారు. రామప్ప వరల్డ్ హెరిటేజ్ 33 కోట్ల 80 లక్షల రూపాయలు మంజూరుచేసి 6కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని అన్నారు.జిల్లాలో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.పింఛన్ కోసం వేలిముద్రతో అవసరం లేకుండా పోస్ట్ ఆఫీస్ స్మార్ట్ కార్డు ద్వారా పింఛన్ పొందవచ్చని  అన్నారు.జిల్లాలో ధ్వంసమైన రోడ్ల ప్రతిపాదనలు పంపాలని,చెరువులు తెగకుండా కరకట్టు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సెప్టెంబర్ వరకుఅధికారులు సమర్పించాలని సూచించారు.జిల్లాలోని ఎస్టీ మహిళా డిగ్రీ కళాశాల ఓగ్లాపూర్ నుండి పీఎంఆర్సి భవనం ఏటూరు నాగారంకు మారుస్తున్నట్లు మంత్రి తెలిపారు.జిల్లా ఆస్పత్రి ఏర్పాటు కోసం శంకుస్థాపన చేశామని,సిటి స్కాన్ 1250 సిటీ స్కామ్ చేసేమని గిరిజన భవన్ లో క్లైన్ కోట్ ఓపెన్ చేస్తామని, ములుగు జిల్లాను అనిరంగంలో అభివృద్ధి పరుస్తామని తెలిపారు.

జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో నూతన ఆసరా పెన్షన్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజలు నిండు మనసుతో ముఖ్యమంత్రిని ఆశీర్వదించాలని ఆయన కోరారు.జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి పింఛన్లు కొరకు ఎక్కువ దరఖాస్తులు వచ్చేవని,ఇప్పుడు కొత్త పింఛన్లు మన జిల్లాకు 8 424 మంజూరు కావడం శుభసూచికమని‌ అన్నారు.జిల్లా అభివృద్ధి కోసం అధికారులు వరదల సమయంలో అప్రమత్తంగా పనిచేశారని,75వస్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 15 రోజులు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని జిల్లా సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ వివరించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, ఐటిడిఏ పిఓ అంకిత్, అదనపు కలెక్టర్ వైవి గణేష్, ఆర్డీవో కే రమాదేవి,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగ పద్మజ,జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య,జిల్లాఅధికారులు,జడ్పిటిసిలు, ఎంపీపీలు,వైస్ఎంపీపీలు,తహసిల్దార్లు,

ఎంపిడిఓలు,సర్పంచులు,ఎంపిటిసిలు,

ప్రజాప్రతినిధులు,ఆసరా పింఛన్ లబ్దిదారులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: