మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:అశ్వాపురం మండలంలోని మిట్టగూడెం గ్రామానికి చెందిన టెంట్ హౌస్ నిర్వాహుకుడు బత్తుల శ్రీను మండలంలో పాములపల్లి, బట్టీలగుంపు, జగ్గారం,కళ్యాణపురం,మిట్టగూడెం పంచాయితీ సెక్రటరీ లకు మరియు కళ్యాణపురం,మిట్టగూడెం పంచాయతీ లో పనిచేసే నలుగురు మహిళా పారిశుధ్య కార్మికులకు బట్టలను స్థానిక సిఐ చెన్నూరి శ్రీనివాసరావు మరియు శివకామేశ్వరి గ్రూప్స్ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సిఐ సిహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వరదల కారణంగా ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు వీళ్ళందించిన సేవలను గుర్తుంచుకుంటూ వారికి బట్టలు పంపిణీ చేయడం అభినందనీయమని బత్తుల శ్రీనివాస్ ను కొనియాడారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్.ఐ సముద్రాల జితేందర్ సర్పంచ్ లు భూక్యా బుజ్జీ, పర్షిక రాజమ్మ స్థానికులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: