మన్యం టీవీ చర్ల :
చర్ల మండలంలోని తేగడ, రాళ్లగుడెం, లింగాపురం, కొయ్యూరు, పాత చర్ల గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుచున్నా 410 మంది నిరుపేద విద్యార్థిని విద్యార్ధులకు రెండు లక్షల రూపాయల విలువ చేసే బ్యాగ్స్, నోట్ పుస్తకాలు, పలకలు, పెన్నులు మరియు గిఫ్ట్ పాకెట్స్ లను గ్రేట్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవ సంస్థ ఖమ్మం వారు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లు, స్కూల్ ప్రదానోపాద్యులు పాల్గొని వారి చేతులు మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ వారు మాట్లాడుతూ నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు బ్యాగ్స్, నోట్ బుక్స్, పలకలు ఇవ్వడం చాలా సంతోషకరమని ఇటువంటి సహాయాన్ని అందిస్తున్నటువంటి, గ్రేస్ సొసైటీ స్వచ్ఛంద సేవ సంస్థ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మారుమూల గ్రామాలలో పేద పిల్లలకు సాయం చేయడానికి ఇటువంటి స్వచ్ఛంద సంస్థల ముందుకు రావడం అభినందనీయమని సంస్థ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సేవా సంస్ధ ప్రతినిధులు జయరాజు, లక్ష్మీ నారాయణ, మురళీ కృష్ణ రెడ్డి, సైదులు, సతీష్ మరియు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: