CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండలంలో మట్టి గణపతి ప్రతిమలు పంపిణీ

Share it:


 మన్యం మనుగుడ, అశ్వారావుపేట: వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మట్టి గణపతి ప్రతిమలను మంగళవారం అశ్వారావుపేట మండలంలో పలుచోట్ల పంపిణీ చేశారు. అశ్వరావుపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అశ్వరావుపేట పట్టణంలో విగ్నేశ్వర ఆలయం వద్దా ప్రెస్ క్లబ్ సభ్యులు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. అదేవిధంగా అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామంలో ఆంధ్రజ్యోతి వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి గణపతి ప్రతిమలను విద్యార్థులకు ముఖ్య అతిథిగా పాల్గొన్న అశ్వరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అందరూ బాధ్యతగా సహకరించాలన్నారు. మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ స్థానికులకు, విదార్థులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. మండలంలో వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ప్రశాంత వాతావరణంలో గణేష్‌ ఉత్సవాలు జరుపుకునేందుకు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీఐ బాలకృష్ణ అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: