మన్యం టీవీ చర్ల : ఈ రోజు సేవా భారతి ఆధ్వర్యంలో చర్ల మండలంలో మారుమూల గ్రామమైన కుదునూరు దగ్గర వీరాపురం గ్రామములో డాక్టర్ మౌనిక సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. డాక్టర్ మౌనిక 70 మందిని పరిక్షించి ఉచితంగా మందులను ఇవ్వడం మరియు కోవిడ్ వే క్సిన్ వేయడం జరిగింది. ఈ కార్య క్రమంలో సేవా భారతి కార్య దర్శి సాయి మాట్లాడుతూ సేవా భారతి అనేక సేవా కార్యక్రమాలు చేస్తోoదని గోదావరి వరద ముంపు బాధితులకు అండగా నిలిచి నిత్యావసర సరుకులు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అని సేవా భారతి అంబులెన్సును ఆపదలో ఉన్నవారు విని యోగంచికోవాలని వారు తెలియ చేశారు. అనంతరం డాక్టర్ మౌనిక మాట్లాడుతూ ఏజన్సీ లో ఉన్న ప్రజలు వ్యాధులు బారిన పడకుండా తగు జాగ్ర త్తలు తీసుకోవాలని దోమతెరలు వాడాలని అందరూ కోవిడ్ వేక్సిన్ చేయించు కోవాలి అని వారు తెలియ చేశారు. ఈ కార్య క్రమంలో సేవా భారతి మండల అధ్యక్షులు కీర్తి సురేష్ గ్రామీణ వైద్యలు సేవా భారతి సభ్యులు బత్తుల వెంకటేశ్వర్లు ,పూజారి సురేష్,దొడ్డి సూరిబాబు బేతంచర్ల వెంకటేశ్వర్లు,గొం ది సో బన్, హెల్త్ సూపర్ వైజర్ బాబురావు హెల్త్ అసిస్టెంట్ శ్రీలక్ష్మి అంగనవడి పావని ఆశ వర్కర్ గంగమ్మ అంబులెన్స్ డ్రైవర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: