మన్యం టీవీ చర్ల : దుమ్ముగూడెం మండలం లో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ బ్యాక్ వాటర్ వలన తాలిపేరు పరివాహక ప్రాంతాలయన గ్రామాలలోని 250 కుటుంబాలు మారియు సుమారు 500 ఎకరాల సాగు భూమి ముంపుకు గురయ్యే అవకాశం ఉన్నందున, ఆ ప్రాంతాన్ని కూడా రీ సర్వే చేపించి కరకట్ట మంజూరు చేయించవలసిందిగా తెరాస పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నక్కినబోయిన శ్రీనివాసయాదవ్, కేశవపురం గ్రామపంచాయతీ సర్పంచ్ కోరం నాగేంద్ర, పినపాక నియోజకవర్గ ఏమ్మెల్యే ప్రభుత్వ విప్ మరియు జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మరియు తెరాస రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డా. తెల్లం వెంకట్రావుకు ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ కు వినతిపత్రం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చర్ల మండల , ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి, చర్ల టౌన్ అధ్యక్షులు ముమ్మనేని సత్య సంపన్, రైతు సమన్వయ కమిటీ నాయకులు పొట్రూ బ్రహ్మానందరెడ్డి, సీనియర్ నాయకులు దొడ్డి తాతారావు, గొమ్ముగూడెం సర్పంచ్ పొడియం మురళి, ఉద్యమ నాయకులు మహబూబ్ పఠాన్, సోషల్ మీడియా ఇంచార్జ్ పంజా రాజు, జెట్టి శ్రీను పాల్గొనడం జరిగింది.
Post A Comment: