మన్యం మనుగడ, మంగపేట.
రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన గ్రామ సేవకుల నిరవధిక సమ్మె 37 వ, రోజు లో భాగంగా మంగపేట మండలం కేంద్రం లో గ్రామ సేవకుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, గ్రామ సేవకుల హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన త్యాగాధనులను స్మరించుకుంటూ గ్రామ సేవకులందరు మంగళవారం మౌనంగా నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం లో మంగపేట మండల గ్రామ సేవకుల అధ్యక్షులు పాగా బాబు, ఉపాధ్యక్షులు కర్రీ నాగార్జున, ప్రధాన కార్యదర్శి కర్రి నరసింహ మూర్తి, కోశాధికారి మాటూరి కౌసల్య, సభ్యులు నరసింహారావు, గౌసియాబేగం, సమ్మక్క, సమ్మయ్య, రాజేశ్వరి, పగిడమ్మ, రాణి, రాము, ఈశ్వరమ్మ, శ్రీను, మాధవి, ఖాజా హుస్సేన్, కార్తీక్, ఎల్లమ్మ, ముజఫర్, వెంకటనర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: