మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : మండల కేంద్రంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం కూర బాలకృష్ణ చారిటబుల్ సర్వీస్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కూర శ్రీధర్ మాట్లాడుతూ.... పర్యావరణానికి రసాయన పదార్థాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడటం వల్ల ఎంతో నష్టం జరుగుతుందన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మట్టి విగ్రహాలు పూజించాలన్నారు . ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధారా రమేష్, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు పసుమర్తి శేషగిరిరావు, సంఘం నాయకులు దారా బాబు, సంకా కృపాకర్, చీదెళ్ల పవన్ కుమార్, కొందుమూరి సత్యనారాయణ, టిఆర్ఎస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు ఉప్పతల గణేష్, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: