మన్యం మనుగడ, పినపాక:
75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ఆగస్టు 16వ తారీకు అనగా రేపు ఉదయం 11 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం పినపాక మండల పరిధిలోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద, జానంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జరుపబడుతున్నందున మండల ప్రజలందరు కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని, స్వాతంత్ర స్ఫూర్తిని నింపాలని ఏడూళ్ల బయ్యారం సిఐ బూర. రాజగోపాల్ కోరారు. ఈ గీతాలాపన జిల్లావ్యాప్తంగా నిర్వహించబడుతుందని, అందులో భాగంగా ప్రతి గ్రామపంచాయతీ నుండి యువత ముందుడాలని,ప్రజలందరు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐ రాజగోపాల్ కోరారు.
Post A Comment: