మన్యం మనుగడ వాజేడు ఆగస్టు 15. స్వరాజ్యపాలనలో 75 సంవత్సరాలు గడిచి 76వ సంవత్సరం లో అడుగులు వేసాము ఈ శుభ సందర్భంలో వాజేడు మండల కేంద్రంలో మండల తహసిల్దార్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 250 సంవత్సరాలు బ్రిటిష్ పాలన నుండి ఎందరో మహనీయులు, మహానుభావులు, ప్రాణ త్యాగ ఫలితమే ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము అని అన్నారు. ఆ మహనీయుల ఆశయ సాధనకు నేటి యువతరం కదం తొక్కాలని అన్నారు. బ్రిటిష్ పాలన నుండి విముక్తి , స్వతంత్రత,కొరకు సిపాయిల తిరుగుబాటు 1885 సంవత్సరంలో ఒక్క సిపాయి ద్వారా తిరుగుబాటు మొదలైంది. ఆనాటి నుండి 1947 వరకు ఎందరో మహాజ్వాలత వ్యక్తులు బ్రిటిష్ వారి కుట్రలకు బలైపోయారు అని అన్నారు. మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకోవాలని స్వరాజ్య పాలన కొరకు స్వతంత్రం తెచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఆర్ ఐ ,రాజు ,పోలీస్ అధికారులు, టీచర్స్, డాక్టర్స్, ఏఎన్ఎం, ఆరోగ్య కార్యకర్తలు, విద్యార్థులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: