గుండాల/ఆళ్లపల్లి ఆగస్ట్ 8(మన్యం మనుగడ) అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఆళ్లపల్లి ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి కోరారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మండల కేంద్రంలోని ఆదివాసి కమ్యూనిటీ హాలు ప్రాంగణమునందు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. మండలంలోని ఆదివాసి ప్రజాప్రతినిధులు, అధికారులు, దొర పటేల్స్, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కళాబృందాలు తో సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుందని ఆమె అన్నారు
Post A Comment: