CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీపీఐ మండల కార్యవర్గ సభ్యులు,ఎఐఎస్ఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షులు గజ్జెల సందీప్ అంతిమ యాత్ర లో పాల్గొన్న అశేష జనం.నివాళ్ళు అర్పించి,పాడే మోసిన సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా సిపిఐ నాయకులు.సందీప్ కు నివాళ్లు అర్పించిన తెరాస,టీడీపీ,సిపిఎం,ప్రజాపందా, జనసేన పార్టీ మండల నాయకులు.

Share it:


   


ములకలపల్లి: (ఆగస్ట్ 08)మన్యం మనుగడ ప్రతినిధి :

పొగళ్లపల్లి గ్రామానికి చెందిన సీపీఐ మండల కార్యవర్గ సభ్యులు, ఎఐఎస్ఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షులు గజ్జెల సందీప్ శనివారం హైదరాబద్ నిమ్స్ హాస్పటల్ నందు మృతి చెందగా సోమవారం పొగళ్లపల్లి లో అంత్యక్రియలు జరిగియి.సందీప్ మృత దేహం పై సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఐ జిల్లా నాయకులు నరాటి ప్రసాద్,ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఉపిశెట్టి రాహుల్,నాయకులు బల్లా సాయి,జిల్లా ఎఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు ఉపేంద్ర ఫయూమ్ సీపీఐ మండల కార్యదర్శి ఎండీ యూసుఫ్ నాయకులు రమేష్, కొర్రీ భద్రం, ఎస్ కె జబ్బార్ ,సాయి వీరు,తదితరులు సందీప్ భౌతిక కాయం పై ఎర్ర జెండా కప్పి నినాదాలు చేసి నివాళ్లు అర్పించారు.ఈ సందర్భంగా జరిగిన సంతాప సభ లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ,సందీప్ చిన్న వయసు లో విద్యార్థి , ఉద్యమం లో చురుకైన పాత్ర పోషించి మండల జిల్లా స్థాయి లో పేరు సంపాదించుకున్న గొప్ప నాయకుడని,ములకలపల్లి మండలం లో ప్రజా ఉద్యమం లో సిపిఐ నాయకుడిగా నరాటి ప్రసాద్ తో కలిసి పార్టీ అభివృద్ధి కి కృషి చేసిన మిలిటెంట్ నాయకుడు సందీప్ అని అన్నారు. సందీప్ మృతి తో సిపిఐ పార్టీ కి తీవ్ర లోటు అని సందీప్ కుటుంబానికి సిపిఐ ఎల్లపుడూ అండగా ఉంటుందని అన్నారు.ఈ సందర్భంగా సిపిఐ శ్రేణులు పాడే మోసి సందీప్ పట్ల ప్రేమ ను చాటుకున్నారు. ఈ కార్యక్రమం లో తెరాస మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు , మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు,ఉకంటి రవి, టీడీపీ మండల అధ్యక్షులు తెల్ల చెన్నయ్య , ప్రజాపందా మండల నాయకులు పోతుగంటి లక్ష్మణ్, సర్పంచ్ రమణ,ఎంపీటీసీ పుల్లారావు, ములకలపల్లి సర్పంచ్లు బీబినేని భద్రం,బైటి రాజేష్ , తెరాస మండల కార్యదర్శి అంజాన్ రావు , కాంగ్రెస్ మండల నాయకులూ పాలకుర్తి రత్న బూసనం,రవి,చిన్నారావు,గ్రామస్థులు పాలకుర్తి ప్రసాద్,శ్రీను ,రాము రాంబాబు, సిపిఐ జిల్లా నాయకులు గుండిపెన్ని వెంకటేశ్వర్లు ఎఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగుల్ మీరా, ఎస్ కె చందా పాషా,సాయి,వీరు నాయక్, రంజిత్,బాల కృష్ణ,బీసీ సంఘము అధ్యక్షులు సురభి రాజేష్ ,గాదె గోని వెంకటేష్ ,గిరిజన సంగం నాయకులు చిరుమప్ప. తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: