మన్యం మనుగడ ప్రతినిధి, బూర్గంపహాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడు మండలం సారపాక పట్టణంలోని గాంధీనగర్ ఏరియాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి సహకారంతో గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు బియ్యంతో పాటుగా పలు రకాల నిత్యవసర సరుకులను ముంపు బాధితులకు బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రజలకు ఏ కష్టాలు వచ్చిన తక్షణమే వారి కష్టసుఖాలను తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరిస్తున్నారని, వారి తెలియజేశారు, రేగా కాంతారావు ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటా ప్రజలకు భరోసా కల్పిస్తున్నారని అన్నారు, గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు రాజ్యసభ సభ్యులు ఎంపీ బండి పార్థసారథి రెడ్డి గారి సహకారంతో కోటి రూపాయలతో పినపాక నియోజకవర్గం లో 13 వేల కుటుంబాలకు బియ్యంతో పాటు సరుకులు పంపిణీ చేయడం జరిగిందని ప్రజలకు తెలియజేశారు, భవిష్యత్తులో గోదావరి వరద ఉధృతకి గ్రామాలు మునగడం వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మండల టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, సారపాక టౌన్ టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను, టిఆర్ఎస్ పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలి. శ్రీహరి, టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు, టిఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ పవన్ ప్రధాన కార్యదర్శి గుల్ మొహమ్మద్, పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణచంద్రరావు,సారపాక టౌన్ టిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోము చైతన్య రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు బిట్ర సాయిబాబా, బెజ్జంకి కనకాచారి,గాంధీ నగర్ మణి,తుమ్మల.కిరణ్,చట్టు.అంజనేయులు,వీరయ్య,కళ్యాణ్,మోహన్,సొసైటీ డైరెక్టర్ శ్రీను,చిరంజీవి, క్రిష్ణ,సురేష్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: