మన్యం టీవీ చర్ల:
స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం చర్లలో భారీ ఫ్రీడం ర్యాలీ నిర్వహించారు. స్దానిక తహసీల్ కార్యక్రమం వద్ద ప్రారంభమయిన ర్యాలీను తహసీల్దార్ భరణిబాబు, సిఐ అశోక్ లు జెండా ఊపిప్రారంబించారు. భాతర మాతాకీ జై, జైబోలో స్వాతంత్ర్య భారక్ కీ జై అంటూ సాగిన ర్యాలీలో ముందు వరసలో సి ఆర్ పి ఎఫ్ దళాలు త్రివర్ణ పతాకాలను చేతబూనగా అంబేద్కర్ సెంటర్, బస్టాండ్, గాందిబొమ్మ సెంటర్, పోలీస్ స్టేషన్ మీదుగా సాగి గ్రంథాలయం వద్దకు చేరుకుంది. అనంతరం కార్యక్రమం ను ఉద్దేసించి పలువులు ప్రసంగించారు. కార్యక్రమంలో వివిద శాఖలకు చెందిన అదికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, స్దానిక పౌరులు పాల్గొన్నారు.
Post A Comment: