CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

75వ స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో పాల్గొన్న -ఎంఎల్ ఏ మెచ్చా.

Share it:

 


  • త్రివర్ణ రంగులతో అధికారులు, విద్యార్థినిలు ఎమ్మెల్యే మెచ్చా కు స్వాగతం.

ములకలపల్లి:మన్యం మనుగడ ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న 75వ స్వాతంత్ర్య భారత వజ్రొత్సవాల్లో బాగంగా మండల రెవెన్యూ కార్యాలయం నుంచి సాయి బాబా దేవాలయం వారుకు జెండాలు, ప్లకార్డులతో ర్యాలీనిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రమానికి స్థానిక శాసన సభ్యులు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు.ఎమ్మెల్యే కుసాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థినులు స్వాగతం పలికారు. అనంతరం ఎండివొ ఆఫీస్ నుండి సాయిబాబ గుడి సెంటర్ వరకు 75 మీటర్ల జెండాతో ర్యాలీ నిర్వహించారు.ప్రాధాన కూడాలి వద్దకు చేరుకోగానే ఎమ్మెల్యే త్రివర్ణ బలూన్ లను నింగికి వదిలారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశం లో ఎక్కడ లేనివిధంగా మన రాష్ట్రంలో 75వ స్వాతంత్ర్య భారత వజ్రోత్సవలను నిర్వహించడం గర్వ కారణం అని,దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను మనం స్ఫూర్తిగాతీసుకోవాలని తెలియజేసారు,ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.అనంతరంఇటీవల విడుదల అయినా జేఈ మెయిన్స్ ఫలితాల్లోసాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థిని అల్ ఇండియా ర్యాంక్ 25320, కమ్యూనిటీ ర్యాంక్ 157 సాధించిన బుఖ్య అపర్ణ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలోస్థానిక ఎస్.సురేష్,ఎంఆర్ వొ ఎల్.వీరభద్రం, ఎంపిడివో చిన్న నాగేశ్వరావు,జెడ్పిటిసి సున్నం నాగమణి,ఎంపిపి మట్ల నాగమణి,టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరంపుడి అప్పారావు,మాజీ జెడ్పీటీసీ బత్తుల అంజి,మండల ప్రధాన కార్యదర్శి సెనగపటి అంజి,సర్పంచ్ లు భద్రం,సుధీర్,పెంటయ్య,పామర్తి వెంకటేశ్వరరావు, పాత్రికేయ మిత్రులు, ప్రధానోపాద్యాయులు,ఉపాద్యాయులు,అటవీశాఖ సిబ్బంది,ఐకేపి సిబ్బంది,మండల యువజన విభాగం అధ్యక్షుడు తాటి ప్రవీణ్, మంగపతి,చందర్ రావు, సీతారాములు,రాజారావు,సుధాకర్, సీపీఐ నాయకులు నరటిప్రసాద్, మధు, బుజ్జి,రవి, సత్యనారయణ, రాజేష్, సాయి, కొమరయ్య, సోహెల్,తదితర ముఖ్య నాయకులు,కార్యకర్తలు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: