మన్యం టీవీ చర్ల:
చర్ల మండలం లో ఈ రోజు టూకే రన్ కార్యక్రమంను 75 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు కార్యక్రమాలలో భాగంగా ఉదయం 6 గంటలకు ఆయిల్ బంక్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా చర్ల గ్రామ పంచాయితీమార్కెట్ యార్డ్ వరకు ఫ్రీడమ్ రన్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున, ప్రజా నాయకులు, యువత, రాజకీయ ప్రజా ప్రతినిధులు మరియు మీడియా మిత్రులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
Post A Comment: