CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఉల్లాసంగా ఏడూళ్ల బయ్యారం పోలీసుల 2 కే రన్.పాల్గొన్న పినపాక మండల ప్రజా ప్రతినిధులు అధికారులు

Share it:


మన్యం మనుగడ,పినపాక: 


75వ స్వతంత్ర ఉత్సవాలలో పినపాక మండల వ్యాప్తంగా ఫ్రీడం రన్ వేడుకను పినపాక మండల ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్వహించారు. పినపాక మండల తహసిల్దార్ కార్యాలయం నుండి ఏడూళ్ళ క్రాస్ రోడ్ వరకు టు కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడూళ్ళ బయ్యారం సి ఐ రాజగోపాల్ మాట్లాడుతూ, స్వతంత్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమతమ నివాసాల పై జాతీయ జెండాను ఎగురవేసి, దేశం పట్ల ఉన్న ప్రేమను చాటుకోవాలని తెలియజేశారు. ప్రజా గాయకుడు సిద్దెల హుస్సేన్ భరతమాత గొప్పతనాన్ని పొగుడుతూ, గానం చేసి అందరినీ అలరించారు. ఎంపీపీ గుమ్మడి గాంధీ స్వతంత్రం సాధించిన విధానం గురించి వివరించారు. తహసిల్దార్ విక్రమ్ కుమార్ స్వతంత్ర భారతావని కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు తన సంతోషాన్ని తెలియజేశారు. పినపాక మండల తహసిల్దార్ కార్యాలయం నుండి ఏడూళ్ళ క్రాస్ రోడ్ వరకు టు కే రన్ నిర్వహించారు. ఈ ఫ్రీడమ్ రన్ లో భాగంగా, మండల అధికారులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, ప్రజానీకం, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: