మన్యం టీవీ దుమ్ముగూడెం ::
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలలో దేశభక్తిని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తూ ఈరోజు మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పిట్ ఇండియా ఫ్రీడం 2కె రన్ మండల కేంద్రంలోని లక్ష్మీనగరం నుండి ఆంధ్ర కేసరి నగర్ వరకు సాగే యాత్రలను దుమ్ముగూడెం ఎస్సై రవికుమార్, కేశవ ప్రారంభించారు. దుమ్ముగూడెం పోలీసు వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తాసిల్దార్ చంద్రశేఖర్ ఎంపీడీవో చంద్రమౌళి జడ్పిటిసి సీతమ్మ మండల అధికారులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకొని జరుపుకునే వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా టూకే రన్ నిర్వహిస్తున్నట్టు అలానే దేశం కోసం ప్రాణాలు తెగించి స్వాతంత్రం రావడానికి కృషిచేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు 13వ తారీఖున ఉదయం 11 గంటలకు జరిగే తివర్ణ పతక ప్రదర్శన ర్యాలీకి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమం కి లక్ష్మీ నగరం ఆశ్రమం పాఠశాల విద్యార్థులు రన్ విజయవంతం చేయడంతో పాటు ప్రత్యేక ఆకర్షణ నిలిచారు మండలంలోని పాల్గొన్నటువంటి ప్రజలకు అధికారులకు యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ ప్రసాద్ ఏపీ సుకన్య ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సురేష్ టిఆర్ఎస్ మండల కార్యదర్శి కనితిరాముడు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగమణి సిఆర్పి సిబ్బంది గ్రామస్తులు ప్రజలు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు .
Post A Comment: