మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం చేగర్షల గ్రామం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఇసుక లోడుతో వస్తున్న లారీ ఢీకొనడంతో వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు కొత్తగూడెం ప్రాంతంలోని ఆదివాసీ ప్రాంతమైన పెనగడపకు చెందిన వారని సమాచారం . పెనగడప నుండి ఏటూరునాగారం వెళుతున్నారని సమాచారం. అందులో ఒకరిని ముస్కి దేవయ్యగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Navigation
Post A Comment: