మన్యం మనుగడ కరకగూడెం:మండల పరిధిలోని కరకగూడెం,అనంతారం అంగన్ వాడీ సెక్టర్ పరిధిలో గొల్లగూడెం,కల్వలనాగరం అంగన్ వాడీ కేంద్రం తల్లి పాల వారోత్సవాలు నిర్వహించి ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమానికి కల్వలనాగరం అంగన్వాడీ కేంద్రం జరుగుతున్న వారోత్సవాలకు సూపర్ వైజర్ టి.బద్రమ్మ హాజరై మాట్లాడుతూ కార్యక్రమాన్ని ఉద్దేశించి అమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన ఒక్క గంటలోపు తల్లి ముర్రుపాలు పట్టాలని ముర్రు పాలలో వ్యాధినిరోధక శక్తి ఉంటుందనీ విటమిన్ A ,మాంసకృత్తులు,మొదలగు బిడ్డకు ఒక్క టీకా లాగ పనిచేస్తుందని అన్నారు.బిడ్డకు అరు నేలల వరకు తల్లి పాలు మాత్రమే త్రాగించాలని తల్లి పాలలో బిడ్డకు కావలసిన పోషకాలు అన్ని తల్లి పాలలో మాత్రమే ఉంటాయని అన్నారు.అలాగే పెట్టుపాలు (డబ్బ పాలు) గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మంగ,హెచ్ వి.బద్రమ్మ,ఆశాకర్యకర్త సుగుణ, ఆయ.పద్మ,గొల్లగూడెం అంగన్వాడీ టిచర్ కుంజ సావిత్రి, అంగన్వాడీ ఆయ సుగుణ, ఆశాకర్యకర్త ఇర్ప.సాంబలక్ష్మి మహిళలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: