జూలూరుపాడు ఆగస్టు 6, (మన్యం మనుగడ ప్రతినిధి) మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల నందు శనివారం మండల విద్యాశాఖ అధికారి జి వెంకట్ తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదవ తరగతి, లేదా ఇంటర్మీడియట్ దూర విద్యా విధానంలో ప్రవేశం కొరకు ఫీజు కట్టదలచిన వారు ఈ నెల 14వ తారీకు చివరి తేదీ అన్న విషయం తెలియజేయడానికి కరపత్రాన్ని విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఈ విషయంలో అదనపు సమాచారం కావలసినవారు మండల కోఆర్డినేటర్ ఆర్ శ్రీనివాసరావు, లేదా అసిస్టెంట్ కోఆర్డినేటర్ గురుమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూలూరుపాడు గారిని సంప్రదించవలసిందిగా కోరారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు, నర్సాపురం, పాపకొల్లు ప్రధానోపాధ్యాయులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Post A Comment: