జూలూరుపాడు ఆగస్టు 6, (మన్యం మనుగడ ప్రతినిధి)
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతిని పురస్కరించుకొని శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదేశానుసారం మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా వారి చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ ఏ ఆశయాలతో జీవించారో, ఏ ఆశయ సాధన కోసం పోరాటం చేశారో, ఆ పోరాట స్ఫూర్తి ఆశయాలను తెలంగాణ బిడ్డలగా మనమందరం కూడా వారి ఆశయ సాధన కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం, కెసిఆర్ అడుగుజాడలలో ప్రతి ఒక్కరం నడిచి, బంగారు తెలంగాణ దిశగా పయనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సోనీ, పిఎసిఎస్ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, జిల్లా నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, రైతు మండల అధ్యక్షులు యదళ్ళపల్లి వీరభద్రం, మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు,ఎంపీటీసీ లు మధుసూదన్ రావు, పొన్నెకంటి సతీష్, రామిశెట్టి రాంబాబు, రోకటి సురేష్, దుద్దుకూరు కృష్ణ, ప్రసాద్, దేవరకొండ కిరణ్, వెల్లంకి పుల్లయ్య, మాచినేని సత్యం, గుగులోత్ చంటి, మోదుగు రామకృష్ణ, మిర్యాల కిరణ్ కుమార్, పనితి వెంకటేశ్వర్లు, ఎస్కే మైబు, చేపల మడుగు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: