జూలూరుపాడు ఆగస్టు 6, (మన్యం మనుగడ ప్రతినిధి) ఈనెల 9న కొమరం భీం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూలూరుపాడు మండల కేంద్రంలో జరగబోయే ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో వైరా నియోజకవర్గం పరిధిలో గల ఆదివాసీలంతా పాల్గొనాలని ఫౌండేషన్ సభ్యులు పిలుపునిచ్చారు. అదే రోజు ఆదివాసి శాసనసభ్యులచే మండల కేంద్రంలోని పాపకొల్లు సెంటర్ నందు "ఆదివాసి ముద్దుబిడ్డ మన్యం బెబ్బులి" కొమరం భీమ్ విగ్రహం ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలో ఆదివాసిల సంస్కృతి, సాంప్రదాయ కొమ్ము, డోలు నృత్యాలు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు ఆదివాసి సభ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తెల్లం నరసింహారావు దొర మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బచ్చల లక్ష్మయ్య, వాసం శ్రీకాంత్, పూనెం సూరయ్య, మడి రవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: