CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వైద్యం వికటించి పసిపాప మృతి..ఆర్ఎంపి వైద్యుడు ఇచ్చిన మందు తాగి పాపం మరణించింది అని తల్లిదండ్రులు ఆందోళన..

Share it:


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

ఆర్ఎంపి వైద్యుని వైద్యం వికటించి నాలుగు నెలల పసిపాప మృతి చెందింది దుమ్ముగూడెం మండల పరిధిలోని నరసాపురం గ్రామానికి చెందిన ఆర్ఎంపి వైద్యుడు కాజా పాషా వద్దకు ఏజెన్సీ మారుమూల గ్రామమైన పైడిగూడెం చెందిన కాకవీరస్వామి గంగమ్మ దంపతుల కుమార్తె నిన్నటి నుండి స్వల్ప జరంతో జరుగుతూ బాధపడుతుంది పాపకి వైద్యం చేయించుకునేందుకు నరసాపురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు అక్కడ వైద్యుడు లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుని వద్దకు తీసుకెళ్లారు ఆ పసిపాపను పరీక్షించిన భాష జ్వరము జలుబు ఉందని నిర్ధారించి ఒక సిరప్ ను పట్టించాడు కొద్దిసేపటి అనంతరం పాపకి జ్వరం తగ్గినట్టు అనిపించి తల్లిదండ్రులు మందులు తీసుకుని తిరిగి ఇంటికి ఆటోలు వస్తుండగా లక్ష్మీ నగరం గ్రామానికి రాగానే పాప వాంతులు చేయడం శరీరం విపరీతంగా వేడికి అపస్మారక స్థితిలో వెళ్ళింది కంగారుపడిన తల్లిదండ్రులు వెంటనే మళ్లీ ఆర్ఎంపి వైద్యుని దగ్గరకు తీసుకుని వెళుతుండగా మార్గమధ్యంలో పాప మరణించింది విషం తెలుసుకున్న గ్రామీణ వైద్యుడు అక్కడ నుండి పరారైనట్లు తెలిపారు ఆర్ఎంపి వైద్యుడు పాపను పూర్తిగా పరిశీలించకుండా అధిక డోసు మందు పట్టించడం వల్లనే పాప చనిపోయిందని తల్లిదండ్రులు బంధువులు గ్రామస్తులు ఆర్ఎంపి ఇంటి వద్ద ఆందోళన చేశారు.

Share it:

TS

Post A Comment: