CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పెదల జీవితాల్లో వెలుగు నింపిన దళిత బంధు.పేద కుటుంబాలకు భరోసా.-ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం:దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికే దళిత బంధు అని ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.

కరకగూడెం మండలంలోని సమాత్ భట్టుపల్లి గ్రామ పంచాయతీ కొర్నివెల్లి గ్రామానికి చెందిన బంధు సతీష్ కి దళిత బంధు పథకం ద్వారా మంజూరైన డిజే సౌండ్ సిస్టం శనివారం లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపి భావితరాలకు బంగారు బాట వేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే కన్న కలలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నారు.

దళితులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు దళిత బంధు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

సీఎం కేసీఆర్‌ నిరంతరం బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు.పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి దేశానికే ఆదర్శంగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.

దళితులు దళిత బంధును సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళిక టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల సోమయ్య,మండల ప్రధాన కార్యదర్శి బుడగం రాము, నాయకులు కొంపెల్లి పెద్దరామలింగం,యలిపెద్ది శ్రీనువాస రెడ్డి,బైరశెట్టి చిరంజీవి,యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,యూత్ కార్యదర్శి యాగడ్డి శ్రీనువాసు,రేగా సత్యనారాయణ,యాకూబ్ ఖాన్,ప్రసాద్,క్రిష్ణ,వేణు,వెంకటేశ్వర్లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: