మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్ యందు అశ్వరావుపేట మండలం ఆదివాసి నాయకపోడు సేవా సంఘం గౌరవ అధ్యక్షులు కోల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సీఐ బాలకృష్ణను మరియు ఎస్సై చల్ల అరుణాను ఆదివాసి నాయకపోడు సేవా సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలను బహుకరించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆదివాసీలకు విద్యా, చట్టాలు, సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని మండల కమిటీ కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నారం సీతారాం సింగ్, కోశాధికారి గడ్డం సత్తిబాబు, వేదాంతపురం సర్పంచ్ సోమిని శివప్రసాద్, గోపిన సత్తిబాబు, నారం శ్రీను, సంగం దుర్గయ్య, పూజారి పోతురాజు, తాళ్ల నాగార్జున, దానపు జగపతి, తోట వెంకటస్వామి, ఏది రాజు, పండు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: