మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మణుగూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ ఏరియాకి చెందిన నల్లాడి అప్పారావుకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.51 వేల రూపాయల విలువ గల చెక్కును విప్ రేగా కాంతారావు వారి చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సీఎం రిలీఫ్ ఫండ్ తో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని, పేదల సంక్షేమానికి ఎంత ఖర్చు ఐనా వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ విజయకుమారి, జడ్పిటిసి పొశం నర్సింహారావు, పీఏసీఎస్ కుర్రి నాగేశ్వరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు,అడపా అప్పారావు,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,ముఖ్య నాయకులు,యువజన నాయకులు,సోషల్ మీడియా ఇంచార్జి రాహుల్ గౌడ్,మహిళ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: