గుండాల ఆగస్టు 10(మన్యం మనుగడ) ఏజెన్సీ గ్రామంలో మెరిసిన మైక్రోశిల్పి గుండాల మండలం మామ కన్ను పంచాయతీలోగల అంబరాశి పల్లి గ్రామంలో గిరిజన యువకుడు కల్తీ ప్రవీణ్ పెన్సిల్ పై ఎన్నో మైక్రో శిల్పాలను చెక్కి ఔరా అనిపిస్తున్నాడు. పదో తరగతి వరకు చదువుకొని ప్రస్తుత ఇంటి వద్ద ఉంటూ తన కళా నైపుణ్యంతో పెన్సిల్ పై జాతీయ జెండా, కొమరం భీమ్ తోపాటు అనేక కళాఖండాలను తన నైపుణ్యంతో చెక్కుతూ పలువురుని అబ్బురపరుస్తున్నాడు. పెన్సిల్ రాయటం కోసం చెక్కుతుంటేనే విరిగిపోతుంది అలాంటి పెన్సిల్ పై కళాఖండాలను చెక్కుతూ తన కళ నైపుణ్యాన్ని నిరూపించుకుంటున్నారు. ఇలాంటి యువకుడిని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించి ముందుకు పంపితే మరిన్ని కళాఖండాలను చెక్కి తన సత్తాను నిరూపించుకునే అవకాశం ఉంటుంది
Navigation
Post A Comment: