కొమరం భీమ్ చండ్రుగొండ:
దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ట్రస్టు ద్వారా గిరిజనుల అభివృద్ధికి పలు రకాల సహాయ సహకారాలు అందిస్తూ వారికి చేయూత అందిస్తున్నట్లు మాజీ మంత్రి జలగం ప్రసాదరావు చెప్పారు. చండ్రుగొండ మండలంలో రేపల్లెవాడ, సత్యనారాయణపురం, చండ్రుగొండ గ్రామాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రుగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసాదరావు మాట్లాడుతూ నర్సింగ్ కోర్స్ చేసే గిరిజన యువతలకు తమ ట్రస్ట్ ద్వారా ఆర్థికసాయం అందిస్తామన్నారు. గిరిజన రైతులకు విద్యుత్ లైన్ల ఏర్పాటు, విద్యుత్ మోటార్ల కొనుగోళ్లకు ఆర్థికసాయం అందిస్తామన్నారు. గిరిజన యువకులకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ ట్రస్టు చేయూత అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి. షబీర్ హుస్సేన్ కాంగ్రెస్ జిల్లా నాయకులు బడుగు శంకర్, చిన్ని, జలగం అనుచరుడు బేతి రాంబాబు, ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు సంకా శంకర్, ఎస్ఎంసీ చైర్మన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ ఇస్లావత్ రుక్మిణి ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: